మొట్టమొదటి ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని 2010లో పాటించారు. ప్రతి సంవత్సరం పిచ్చుకల దినోత్సవాన్ని మార్చి 20న జరుపుతారు. అంతర్జాతీయంగా పిచ్చుకల సంరక్షణ కోసం ఈ దినోత్సవాన్నినేచర్ ఫరెవర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్ కు చెందిన ఎకో-సిస్ యాక్షన్ ఫౌండేషన్ మరియు ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల తోడ్పాటుతో నిర్వహిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న సహజ జీవవైవిధ్యం మరియు జాతుల సంరక్షణ అవసరాన్ని గుర్తెరిగి, అందుకోసం క్రియాశీలకంగా పనిచేయడం కోసం ప్రజలను ఏకం చేయడం ఈ పిచ్చుకల దినోత్సవ ముఖ్యోద్దేశం.