సంఘటనలు
1610 : గెలీలియో బృహస్పతి నాలుగవ ఉపగ్రహమైన
కాలిస్టో ను కనుకొన్నాడు
1888 : వాషింగ్టన్ నగరంలో నేషనల్ జాగ్రఫిక్
సొసైటీ స్థాపించబడింది.
1930: వాల్ట్ డిస్నీ సృష్టించిన కార్టూన్
పాత్ర 'మిక్కీ మౌస్' కామిక్ స్ట్రిప్
తొలిసారి ఓ పత్రికలో ప్రచురితమైంది.
1938 : శాస్త్రసాంకేతిక విషయాలను చర్చి
పెద్దలు అంగీకరించని కాలంలో డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతానికి
చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆమోదం లభించింది.
1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష
చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ
దీక్షకు పూనుకున్నాడు.
1879: 'లయన్స్క్లబ్' స్థాపకుడు
మెల్విన్జోన్స్జన్మదినం. అమెరికాకు చెందిన ఈయన 1917
అక్టోబరులో తన మిత్రులతో కలసి లయన్స్ క్లబ్ను స్థాపించారు. ఈ సంస్థకు సుమారు 160 దేశాల్లో 40 వేల శాఖలు ఉన్నాయి
1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో
సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
1943 : ఎడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం
ప్రకటించాడు
జననాలు
1879: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థను స్థాపికుడు.
1917: నల్లా రెడ్డి నాయుడు, ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ నాయకుడు. (మ.1982)
1919: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996)
1938: శివకుమార్ శర్మ, ప్రముఖ
సంతూర్ వాద్య సంగీత విద్వాంసుడు.
1940: అంబటి బ్రాహ్మణయ్య, ప్రముఖ రాజకీయ వేత్త.
1949: రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి
వెళ్ళిన మొదటి భారతీయుడు.
మరణాలు
1977: హెన్రీ లాంగ్లోయిస్, అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్
ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (జ.1914)
2014: అంజలీదేవి, తెలుగు
సినిమా నటీమణి. (జ.1927)
2016: అద్దేపల్లి రామమోహనరావు తెలుగు కవి,
సాహితీ విమర్శకుడు. (జ.1936)
2016: జె.ఎఫ్.ఆర్.జాకబ్, భారత సైనిక దళంలో మాజీ లెప్టినెంటు జనరల్ మరియు గోవా, పంజాబ్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్. (జ.1923)
2017: అంగర సూర్యారావు, ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. (జ.1927)