సంఘటనలు
1954 : భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత
స్థాపించబడింది.
జననాలు
- 1917: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)
- 1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య
పోరాట యోధుడు. (మ.1946)
- 1920: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో
జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)
- 1927: మల్లవరపు జాన్, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.2006)
- 1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు
గ్రంథకర్త.
- 1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక
రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర
నిర్దేశకుడు, అధ్యాపకుడు మరియు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
- 1937: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.
- 1957: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత
మరియు రాజకీయనాయకుడు. (మ.2013)
- 1958: ఆహుతి ప్రసాద్, ప్రముఖ సినిమా నటుడు. (మ.2015)
- 1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ
క్రీడాకారుడు.
- 1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)
- 1967: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (మ.2016)
మరణాలు
- 1945: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864)
- 1969: ముప్పవరపు భీమారావు, ప్రముఖ రంగస్థల నటుడు (జ.1909)
- 1983: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత,
నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)
- 1992: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు
అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)
- 2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ప్రముఖ తెలుగు సాహితీ
విమర్శకుడు. (జ.1937)
- 2011: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
- 2015: వసంత్ గోవారికర్, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త,
పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.(జ.1933)
- 2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిష్టు పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)
- 2017: కాకాని చక్రపాణి, ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (జ.1942)
జాతీయ /
అంతర్జాతీయ దినోత్సవాలు
ప్రపంచ
శాంతి దినోత్సవం