చరిత్రలో ఈ రోజు🌎
🐚 జులై 19 🐚
గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 200వ రోజు (లీపు సంవత్సరములో 201వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 165 రోజులు మిగిలినవి.
📀 సంఘటనలు 📀
1956: తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు
.1969: భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి
.1996: 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి
.2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
🎂🍬 జననాలు 🍬🎂
1827: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (మ.1857)
1902: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా పేరొందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1968)
1924: కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020)
1954: దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
1955: రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1956: రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నటుడు.
1979: మాళవిక, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు
1983: సింధు తులాని, భారతీయ సినీనటి...తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించారు
🪔 మరణాలు 🪔
1972: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901)
1991: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912)